5 కేజీల ఐఈడీ నిర్వీర్యం
5 kg IED defused

రాయ్ పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మాలో సిఆర్పిఎఫ్, పోలీసులు ఐదు కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా నక్సలైట్లు కొంటా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బండా గ్రామం సమీపంలో ఈఐడీని అమర్చినట్లు గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఐఈడీని వెలికి తీసి నిర్వీర్యం చేశారు. 300మంది సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్ లో ఈ ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. నక్సల్స్ కు వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో భద్రతా దళాలే లక్ష్యంగా పలుచోట్ల ఐడీలను అమరుస్తున్నారు. నక్సల్స్ పాల్పడుతున్న ఈచర్యలను భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి.