ఏప్రిల్​ 17న నవీ ముంబై ఎయిర్​ పోర్ట్​ ప్రారంభం

Opening of Navi Mumbai Airport on April 17

Feb 27, 2025 - 15:20
 0
ఏప్రిల్​ 17న నవీ ముంబై ఎయిర్​ పోర్ట్​ ప్రారంభం

ముంబాయి: నవీ ముంబాయిలో నిర్మించిన నూతన విమాశ్రయం ఏప్రిల్ 17న  ప్రారంభించనున్నారు. గురువారం ఎయిర్​ పోర్ట్​ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. మే నుంచి విమానాశ్రయం ద్వారా విమాన సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. డైరెక్టరేట జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ (డీజీసీఎ), ఏవియేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎఎఐ) బృందాలు విమానాశ్రయ ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్​ రెండో వారంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. మేలో విమానా సేవలు ప్రారంభం అయినా, వచ్చే ఏడాది జూలై నాటికి అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. ఈ విమానం ద్వారా ప్రతీఏటా రెండు కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించనున్నట్లు తెలిపారు. తొలి ఆరు నెలల్లోనే కోటిమంది ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

కాగా మూడు దశల్లో ఈ ఎయిర్​ పోర్ట్​ నిర్మాణానికి రూ. 17వేల కోట్లు కేటాయించారు. తొలిదశలో రూ. 6వేల కోట్లు, రెండో దశలో 3,420 కోట్లు, మూడో దశను 2032 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా విధించుకున్నారు. ప్రస్తుతానికి మొదటి టెర్మినల్​ పై ఇటీవలే విమానాన్ని విజయవంతంగా ట్రయల్​ రన్​ కూడా సక్సెస్​ చేశారు. రెండో టెర్మినల్​ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విమానాశ్రయ ఏర్పాటుకు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలను ఖాళీ చేయించారు. 3500 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద రూ. 520 కోట్లను అందించారు.