25కిలోల ఐఈడీ నిర్వీర్యం
25kg IED defused

రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఉసుర్ అవాపల్లి ప్రధాన రహదారి ధన్ మండి సమీపంలోని రహదారిపై నక్సల్స్ అమర్చిన 25 కిలోల ఐఈడీని భద్రతా దళాలు ఆదివారం నిర్వీర్యం చేశాయి. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీని) భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. ఇటీవల జరుగుతున్న వరుస కూంబింగ్, ఎన్ కౌంటర్ నేపథ్యంలో బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా అనువణువునా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న, నిర్వహించే ప్రాంతాల్లో భారీ ఎత్తున ఐఈడీలు లభ్యమవుతున్నాయని తెలిపారు. వీటిని ఉపయోగించుకునే భద్రతా దళాలపై భారీ దాడులకు నక్సల్స్ పాల్పడుతున్నారనే సమాచారం తమ వద్ద ఉందన్నారు.