మిల్కిపూర్ లో 9 గంటల వరకు 13.34 శాతం ఓటింగ్
13.34 percent voting till 9 am in Milkipur

లక్నో: అయోధ్యలోని మిల్కిపూర్ లో ఉప ఎన్నికల ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలు 414 బూత్ లను ఏర్పాటు చేశారు. 3,70,829మంది ఓటర్లున్నారు. 10మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బీజేపీ నుంచి చంద్రభాను పాశ్వాన్, ఎస్పీ నుంచి అజిత్ ప్రసాద్ ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థి సంతోష్ కుమార్ కూడా సమాజ్ పార్టీ (కాన్షీరామ్) టికెట్ పై పోటీ చేస్తున్నారు. దీంతో ఎస్పీకి నష్టం చేకూరనుందనే అభిప్రాయాలున్నాయి. ఉదయం 9 గంటల వరకు మిల్కిపూర్ లో 13.34 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్ ఘటౌలి పోలింగ్ స్టేషన్ లో ఓటు వేశారు. మిల్కిపూర్ లోని పలు కేంద్రాల్లో పొడవాటి క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.