11,12 నో వెహికిల్​ జోన్​ గా ప్రయాగ్​ రాజ్​

అధికారులకు సీఎం యోగి స్పష్టమైన ఆదేశాలు

Feb 11, 2025 - 14:22
 0
11,12 నో వెహికిల్​ జోన్​ గా ప్రయాగ్​ రాజ్​

లక్నో: ప్రయాగ్​ రాజ్​ ను నో వెహికిల్​ జోన్​ గా ప్రకటించారు. 11, 12వ తేదీలలో ప్రయాగ్​ రాజ్​ కు వచ్చే అన్ని వాహనాలపై ఆంక్షలు విధించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా ఏర్పాట్లను సీఎం యోగి ఆదిత్యనాథ్​ మంగళవారం ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లకు తావీయవద్దని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో పలు లోటుపాట్లపై ఇద్దరు ఐపీఎస్​ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల వీఐపీ, వీవీఐపీ పాస్​ లను రద్దు చేశారు. దీంతో 11, 12న పోలీసు, అంబులెన్స్​, పరిపాలనా అధికారుల వాహనాలు మాత్రమే ప్రయాగ్​ రాజ్​ లో తిరగనున్నాయి. భక్తుల వాహనాలకు ప్రయాగ్​ రాజ్​ బయటే పార్కింగ్​ కు ఏర్పాట్లను చేయాలన్నారు. త్రివేణి సంగమం వద్ద ఉన్న అన్ని ఆలయాలను ప్రస్తుతానికి దర్శనాలను రద్దు చేయాలన్నారు.

దీంతో ప్రయాగ్​ రాజ్​ జంక్షన్​ నుంచి భక్తులు 12 కిలోమీటర్లు, సంగం స్టేషన్​ నుంచి ఆరు కిలోమీటర్లు, ప్రయాగ్​ రాజ్​ స్టేషన్​ నుంచి ఏడు కిలోమీటర్లు, దరాగంజ్​ స్టేషన్​ నుంచి మూడు కిలోమీటర్లు,  రామ్​ బాగ్​ స్టేషన్​ నుంచి 8 కిలోమీటర్లు. నైనీ స్టేషన్​ నుంచి 12 కి.మీ, సుబేదార్​ గంజ్​ స్టేషన్​ నుంచి 15 కి.మీ, ఫఫామావూ స్టేషన్​ నుంచి 8 కి.మీ, చివ్​ కీ స్టేషన్​ నుంచి 16 కి.మీ. మేర భక్తులకు కాలినడక తప్పడం లేదు. మరోవైపు మహాకుంభమేళాలో పుణ్య స్నానాలాచరించిన వారి సంఖ్య సోమవారానికి 45 కోట్లకు పైగా చేరుకుంది.