ప్రవాసీయులు దేశ గౌరవాన్ని చాటుతున్నారు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ
భువనేశ్వర్: ప్రవాస భారతీయులు ప్రపంచ సమాజంలో దేశ సంస్కృతి, సాంప్రదాయాలను, గౌరవాన్ని చాటుతున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ కొనియాడారు. ఒడిశా భువనేశ్వర్ జనతా మైదాన్ లో18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ లో రాష్ట్రపతి ముర్మూ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగానికి ముందు వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రవాస భారతీయ కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు డాక్టర్ ఎస్. జైశంకర్, జువల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘ఒడిశా పెవిలియన్’తో సహా వివిధ పెవిలియన్లను సందర్శించారు. ఇది రాష్ట్రంలోని అద్భుతమైన కళ, హస్తకళలను ప్రదర్శిస్తుంది, ఇందులో చేతితో నేసిన చీరలు, క్లిష్టమైన ఫిలిగ్రీ వర్క్, ఇతర సాంప్రదాయ కళాఖండాలు ఉన్నాయి. పెవిలియన్ ఒడిషా సాంస్కృతిక గొప్పతనాన్ని జరుపుకోవడం, కళాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.