రాష్ట్రపతి భవన్ లో పెళ్లి!
Marriage in Rashtrapati Bhavan!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రపతి భవన్ లో వివాహాం జరగబోతుంది. ఇందుకు అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్మూ కూడా ఓకే చెప్పారు. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది? ఎక్కడ? ఎందుకు జరుగుతుందనేది తెలుసుకుందాం. సీఆర్పీఎఫ్ మహిళా అధికారి పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమె ధైర్యసాహసాలపై పలుమార్లు ఉన్నతాధికారులతోపాటు, ప్రధాని మోదీ కూడా కీర్తించారు. ఫిబ్రవరి 12 (గురువారం) పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిస్సా కాంప్లెక్స్ లో వివాహం జరగనుంది. వివాహం రాష్ట్రపతి భవన్ లోనే చేసుకోవాలన్న కోరికపై పూనమ్ గుప్తా అధ్యక్షురాలికి వివరించారు. లేఖ రూపంలో తన విజ్ఞప్తిని సమర్పించారు. ఇందుకు ద్రౌపదీ ముర్మూ సమ్మతించడంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రపతి నివాసంలో వివాహనానికి లైన్ క్లియర్ అయ్యింది. కాగా ఈ వివాహానికి అత్యంత తక్కువ మందినే అనుమతించనున్నారు.
పూనమ్ గుప్తా..
సీఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ మహిళా కమాండోగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో సెక్యూరిటీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. 74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా బృందానికి నాయకత్వం వహించి తన నిబద్ధతను చాటారు. ఈమె మధ్యప్రదేశ్ లోని శివపురి నివాసి. కాగా సీఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్న అవినాష్ కుమార్ ను పూనమ్ వివాహం చేసుకోనున్నారు.