చట్టాలను ఎందుకు సంస్కరించలేదు

ఎన్​ ఎక్స్​ ఈ కాన్​ క్లేవ్​ లో ప్రధాని మోదీ

Mar 1, 2025 - 14:13
 0
చట్టాలను ఎందుకు సంస్కరించలేదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వెదురు నరికితే కేసులు, పెళ్లిళ్లలో సంబురాలు చేసుకుంటే కేసులు ఇలా అనేక బ్రిటిష్​ సమయంలోని చట్టాలను తమ ప్రభుత్వం సంస్కరించిందని ప్రధాని మోదీ తెలిపారు. 75 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో చట్టాలపై ఎందుకు మౌనంగా ఉండిపోయారని (కాంగ్రెస్​)ను నిలదీశారు. భారత్​ జీ–20, ఇతర శిఖరాగ్ర సమావేశాలు ఎన్నింటికో అధ్యక్షత వహించిందని గుర్తు చేశారు. ఎఐ సాంకేతికత, ప్రపంచంలో అతిపెద్ద కాఫీ ఎగుమతిదారు భారత్​ అని ప్రధాని పేర్కొన్నారు. శనివారం న్యూ ఢిల్లీలో జరిగిన ఎన్​ ఎక్స్​ టీ కాన్​ క్లేవ్​ లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. 

లుటియన్​ గ్రూప్​, ఖాన్​ మార్కెటింగ్​ విని ఆశ్చర్యపోయా..
భారత్​ నిర్వహించే సదస్సుల్లో ఎంతోమంది ప్రపంచనలుమూలల నుంచి తరలి వస్తున్నారని, తమదేశ విధానాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా ఎన్నో పనికిరాని, ఒక వర్గాన్ని అణచివేసే ఆ కాలపు చట్టాల గురించి చెప్పడానికి ఏమీ లేదన్నారు. అందరికీ తెలిసిందే అన్నారు. లుటియెన్స్​ గ్రూప్​, ఖాన్​ మార్కెటింగ్​ గ్యాంగ్​ ల గురించి విని తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎందుకు వీటన్నింటిపై మౌనం దాల్చారని కాంగ్రెస్​ పేరెత్తకుండానే నిలదీశారు. ప్రజల స్వేచ్ఛగురించి ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గిరిజనులు, ఆదివాసీలు వెదురును తమ అవసరాల నిమిత్తం అడవుల నుంచి నరికితే కూడా వారికి శిక్షలు వేస్తూ వారి హక్కులను కాలరాశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ చట్టాన్ని కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఆదివాసీలు, గిరిజనులకు స్వేచ్ఛనిచ్చామని చట్టాన్ని రద్దు చేశామన్నారు. మహాకుంభమేళాను చూసి నేడు ప్రపంచమే ఆశ్చర్యపోతుందని చెప్పారు. 

ప్రపంచశక్తిగా భారత్​..
ఫ్రాన్స్​ శిఖరాగ్ర సమావేశాలకు భారత్​ నాయకత్వం వహించిందని, ఎఐ సమ్మిట్​ కు హాజరయ్యే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో భారత్​ కూడా ఇలాంటి సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జీ–20కి అధ్యక్షత వహిస్తూ, మధ్య ప్రాచ్యం యూరప్​ ఆర్థిక కారిడార్​ బ్లూప్రింట్​ ను కూడా సమర్పించామని తెలిపారు. జీ–20లో ఆఫ్రికన్​ యూనియన్​ దేశాలను సభ్యులుగా చేసి గ్లోబల్​ సౌత్​ దేశాల స్వరాన్ని పెంచగలిగామని మోదీ చెప్పారు. ఏఐ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో అనేక మార్పులు తీసుకువచ్చామని, నేడు ప్రపంచశక్తిగా భారత్​ ఎదుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.