యమునా నీటిలో విషం లేదు

కేజ్రీవాల్​ పై సోనిపత్​ లో కేసు నమోదు

Jan 29, 2025 - 20:22
 0
యమునా నీటిలో విషం లేదు

సీఎం నాయబ్​ సింగ్​ సైనీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ​: యమునా నీటిని హరియాణా సీఎం నాయబ్​ సింగ్​ సైనీ తాగారు. సీఎం కేజ్రీవాల్​ ఈ నది నుంచి హరియాణా ద్వారా విషం వస్తుందన్న ఆరోపణలకు కౌంటర్​ ఇచ్చారు. బుధవారం సీఎం ఢిల్లీలోని పల్లా గ్రామంలోని యమునా నది వద్దకు వెళ్లి తన చేతితో రెండుమూడుసార్లు దోసిడన్నీ నీరు తీసుకొని తాగారు. ఈ నీటిలో జలవనరుల శాఖ కూడా నమూనాలు తీసుకుందని కానీ ఎలాంటి విషపు ఆనవాళ్లు లభించలేదన్నారు. కేజ్రీవాల్​ నీరు విషపూరితమని, మారణహోమాలని పిచ్చిపట్టినట్లు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్​ అర్థరహిత వ్యాఖ్యలపై సోనిపత్​ లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్​ 2 డి, 54 కింద కేసు నమోదు చేయనున్నారని సీఎం సైనీ వివరించారు.