పంజాబ్​ పరిపాలన శాఖ రద్దు!

ఆప్​ ఓటమితో అంతర్మథనంలో సీఎం మాన్​ ప్రభుత్వం

Feb 22, 2025 - 12:54
 0
పంజాబ్​ పరిపాలన శాఖ రద్దు!

చండీగఢ్​: ఢిల్లీలో ఆప్​ ఓటమి తరువాత పంజాబ్​ భగవంత్​ మాన్​ సింగ్​ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. శనివారం మంత్రి వర్గ పునర్​ వ్యవస్థీకరణలో భాగంగా పరిపాలనా సంస్కరణల శాఖ బాధ్యత నుంచి మంత్రి కుల్దీప్​ సింగ్​ ధాలివాల్​ ను తప్పించారు. ఏకంగా ఆ శాఖనే రద్దు చేస్తూ సీఎం భగవంత్​ మాన్​ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సంస్కరణలకు కారణం అంతర్గత కలహాలేనని సమాచారం. అయితే ఈ కలహాలేంటనేది బయటికి పొక్కనీయటం లేదు. ప్రస్తుతం కుల్దీప్​ ధాలివాల్​ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. సీఎం మాన్​ నిర్ణయంపై కుల్దీప్​ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. రేపో మాపో ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నాయనే వాదనలూ వినబడుతున్నాయి. కాగా శుక్రవారం 21 మంది ఐపీఎస్​ లను బదిలీ చేస్తూ సీఎం భగవంత్​ మాన్​ ప్రభుత్వం నిర్ణయించింది.