ప్రయాగ్ రాజ్ @ 50 కోట్లు!
Prayag Raj @ 50 Crores!

లక్నో: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పుణ్య స్నానాలాచరించిన వారి సంఖ్య బుధవారం సాయంత్రానికి 50కోట్లను మించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రపంచంలోనే ఏ ఆధ్యాత్మిక వేడుకకు ఇంతపెద్ద ఎత్తున భక్తులు హాజరైన దాఖలాలు కనుచూపు మేరలో కూడా లేవన్నారు. ఉత్తరప్రదేశ్ జనాభానే 25కోట్లన్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకపై పలువురు విమర్శలు, ఆరోపణలు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేశారని అఖిలేష్ యాదవ్ పై ఆరోపణలు సంధించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దని ఓ వైపు చెబుతూనే రహాస్యంగా వ్యాక్సిన్ తీసుకున్నారని అఖిలేష్ చర్యలను బయటపెట్టారు. ఆయన త్రివేణి సంగమంలో స్నానమాచరించి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడని, ఇతరులు మాత్రం స్నానం ఆచరించవద్దని చెబుతాడని విమర్శించారు. మాఘ పూర్ణిమ సమయం బుధవారం రాత్రి 7.48తో ముగిసింది.
కాగా బుధవారం నాడు పుణ్య స్నానాలకు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి, క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ (జితేంద్ర నారాయణ్) సనాతన ధర్మాన్ని స్వీకరించి పుణ్య స్నానం ఆచరించారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలాచరించారు.