అజ్మీర్ లో చాదర్ సమర్పణ
ప్రధాని సందేశాన్ని వినిపించిన కేంద్రమంత్రి రిజిజు

జైపూర్: దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. శనివారం రాజస్థాన్ జైపూర్ లోని అజ్మీర్ దర్గాలో ప్రధాని మోదీ తరఫున చాదర్ సమర్పించి ప్రార్థించారు. అనంతరం ప్రధాని మోదీ సందేశాన్ని రిజిజు వినిపించారు. దేశంలో మతాలు, కులాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనాలని అన్నారు. దర్గా సందర్శ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నవారు. యాప్, వెబ్ పోర్టల్ సేవలు ప్రారంభిస్తామన్నారు. ఇందులో అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుందని రిజిజు వివరించారు. ఈ యాప్ తోపాటు గరబ్ నవాజ్ అనేయాప్ ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఇదే గాకుండా ఉర్స్ ఉత్సవాల కోసం ఆపరేషన్ మాన్యువల్ ను కూడా జారీ చేస్తామన్నారు.
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చాదర్ ను కేంద్రమంత్రి రిజిజు సమర్పించారు. ఉర్సు ఉత్సవాలు జనవరి 1న ప్రారంభమయ్యాయి. రెండోరోజు కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ చాదర్ ను సమర్పించగా, మూడో రోజు ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇంద్రేష్ కుమార్, పలువురు బాలీవుడ్ నటులు చాదర్ ను సమర్పించి ప్రార్థించారు.