కేజ్రీ నామినేషన్​ తిరస్కరించాల్సిందే

బీజేపీ అభ్యర్థి ప్రవేశ్​ వర్మ డిమాండ్​

Jan 18, 2025 - 15:52
 0
కేజ్రీ నామినేషన్​ తిరస్కరించాల్సిందే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేజ్రీవాల్​ అఫిడవిట్​ లో తప్పుడు సమాచారం ఇచ్చాడని వెంటనే ఆయన నామినేషన్​ ను తిరస్కరించాలని బీజేపీ అభ్యర్థి ప్రవేశ్​ వర్మ డిమాండ్​ చేశారు. శనివారం కేజ్రీవాల్​ నామినేషన్​ పై మీడియాతో మాట్లాడారు. ఆర్​ ఓ వద్దే కేజ్రీ నామినేషన్​ ఆగిపోయిందని ఆరోపించారు. న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్​ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి ప్రవేశ్​ వర్మను బీజేపీ రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు. ఆర్​ ఓ ముందు కేజ్రీవాల్​ పోటీపై తమ అభ్యంతరాలను తెలిపామన్నారు.  కేజ్రీవాల్ తన ఆదాయాన్ని 2019–-2020లో రూ. 1,57,823 చూపించారని అన్నారు. ఈ లెక్కల చూసుకుంటే ఆయన ఆదాయం ప్రస్తుతం  రూ. 13,152 లక్షలుగా ఉండాలన్నారు. ఓటరు జాబితాలో ఆయన వార్డు, సీరియల్​ నెంబర్లు కూడా తప్పుల తడకగా ఉన్నాయన్నారు. యూపీలో నమోదైన ఓటరు ఢిల్లీలో ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. నామినేషన్​ లో తనపై దాఖలైన కేసుల విషయాలను ఎందుకు దాచిపెట్టారని నిలదీశారు. కేజ్రీవాల్​ నామినేషన్​ ను పరిశీలించిన ఆర్​ ఓ స్టే విధించారని, తిరస్కరించాలని తాను డిమాండ్​ చేస్తున్నానని ప్రవేశ్​ వర్మ స్పష్టం చేశారు.