ఆర్బీఐ గవర్నర్​ అధ్యక్షతన ఎంపీసీ సమావేశం

MPC meeting chaired by RBI Governor

Feb 5, 2025 - 17:50
 0
ఆర్బీఐ గవర్నర్​ అధ్యక్షతన ఎంపీసీ సమావేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్బీఐ ఎంపీసీ (ద్రవ్య పరపతి సంఘం– మోనిటరింగ్​ పాలసీ కమిటీ) సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్​ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. కేంద్ర బడ్జెట్​ లో ప్రకటనలు, రెపోరేటు తగ్గింపునకు అనుకూల నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. జనవరిలో ద్రవ్యోల్బణం గణాంకాలు 4.5 శాతం ఉండగా, ఫిబ్రవరిలో ద్రవ్య విధాన సమీక్షలో పాలసీ రటులో 0.25శాతం తగ్గింపు అవకాశం ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్​ లో పాలసీ రేటును 0.75 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. బడ్జెట్​ ద్రవ్య విధానానికి అనుకూలంగానే ఉందని భావిస్తున్నారు. ఒకవేళ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎక్కువగా బలహీనపడితే పాలసీ రేటు తగ్గింపు ఆలస్యం కావచ్చని ఇక్రా చీఫ్​ అదితి నాయర్​ అభిప్రాయం వ్యక్తం చేశారు.