ఢిల్లీ పీఠం కమలానిదే
ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమైన మెజార్టీ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఢిల్లీ ఎన్నికల ఘట్టం పరిపూర్ణమైంది. వివిధ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ – ఆప్ మధ్య వార్ కొనసాగుతున్నట్లు ఎన్నికల్లో కనిపించినా అన్ని ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీకి స్పష్టమైన మెజార్టీ దక్కుతుంది. 3 నుంచి ఏడు సీట్ల తేడాతో బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది. అధికారానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ బీజేపీకి దక్కనుంది. అదే సమయంలో ఆప్ మెజార్టీ స్థానాలకు 3 నుంచి 8 స్థానాల దూరంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ విషయాన్ని ‘నా తెలంగాణ దిన పత్రిక– వెబ్ సైట్’ మాధ్యమంగా కూడా పలుమార్లు విశ్లేషిస్తూ కథనాలను కూడా ప్రసారం చేసింది. ప్రధానంగా ఇద్దరి మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ నామ్ కే వాస్తేగానే పోటీలో ఉందని వెల్లడించింది.
ఎగ్జిట్ పోల్స్
మాట్రిజ్: బీజేపీ–35–40 స్థానాలు 46 శాతం, ఆప్ 32–37 స్థానాలు 44 శాతం, కాంగ్రెస్ 0–1 స్థానాలు 8 శాతం, ఇతరులు 2 స్థానాలు 2 శాతం.
జేవీసీ: బీజేపీ–39–45, ఆప్ 22–31, కాంగ్రెస్ 0–2, ఇతరులు 1స్థానం.
చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ – 39–44, ఆప్ 25–28, కాంగ్రెస్ 2–3, ఇతరులు 0.
పీపుల్స్ పల్స్: బీజేపీ 51–60, ఆప్ 10–19, కాంగ్రెస్ 0, ఇతరులు 0.
పీపుల్స్ ఇన్ సైయిట్: బీజేపీ 40–44, ఆప్ 25–29, కాంగ్రెస్ 1, ఇతరులు 0.
పోల్ డైరీ: బీజేపీ 42–50, ఆప్ 18–25, కాంగ్రెస్ 2, ఇతరులు 0
పీ–మార్క్: బీజేపీ 39–49, ఆప్ 21–31, కాంగ్రెస్ 1, ఇతరులు 0