బాలికపై గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్
నిందితుల కోసం పోలీసుల వేట

నా తెలంగాణ, హైదరాబాద్: నేరెడ్ మెట్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల కోసం వేట కొనసాగుతోంది. పలు కీలక విషయాలు వెలుగులొకొచ్చాయి. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన విజయ్ కుమార్ కు ఈ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. బాలికను ట్రా చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను నేరేడ్ మెట్ లోని ఓ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి స్నేహితులో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. బాలిక గర్భం దాల్చడంతో గుర్తించిన తల్లి నిలదీయడంతో అసలు విషయాలు వెలుగులుచూశాయి. దీంతో బాలిక తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. నేరెడ్ మెట్ ఠాణాకు కేసును బదిలీ చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వారు గంజాయి బ్యాచ్ గా పోలీసులు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను రంంలోకి దింపారు.