మోదీని ఓడించేందుకు విదేశీ నిధులు

రాహుల్​ గాంధీపై బీజేపీ నేత గౌరవ్​ భాటియా మండిపాటు

Feb 21, 2025 - 15:34
 0
మోదీని ఓడించేందుకు విదేశీ నిధులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని పదవీచ్యుతుడిని చేసేందుకు భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అమెరికన్​ సహాయ నిధులు (యూఎస్​ ఎఐడీ–యూఎస్​ స్టేట్స్​ ఏజెన్సీ ఆఫ్​ ఇంటర్నేషనల్​ డెవలప్​ మెంట్​–జార్జ్​ సోరోస్​) ఉపయోగించారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ చేసిన ఆరోపణలపై శుక్రవారం బీజేపీ నేత గౌరవ్​ భాటియా కాంగ్రెస్​, రాహుల్​ గాంధీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. విదేశీ సంస్థలు మనదేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఎందుకు చేసుకున్నాయని రాహుల్​ చెప్పాలని నిలదీశారు. పదేపదే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతుందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. దేశంలో ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని కాంగ్రెస్​ కోరుకోవడం లేదన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్​ కు మోదీ ప్రభుత్వ విజయం ఆకళింపు కావడం లేదని మండిపడ్డారు. మోదీతోపాటు దేశ ప్రజలను కూడా వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. 21 మిలియన్​ డాలర్ల సహాయాన్ని పొందిన వారు తమకు సంబంధం లేదని తప్పించుకోజూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్​ అగ్రనాయకత్వం జార్జ్​ సోరోస్​ లాంటి దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపిందని స్పష్టం అవుతుందన్నారు. జార్జ్​ సోరోస్​ కాస్త గాంధీ సోరోస్​ గా మారిందని ఆరోపించారు. మోదీని ఎన్నికల్లో ఓడించేందుకు రాహుల్​ యూఎస్​ కాంగ్రెస్​ మహిళ ఇల్హాన్​ ఒమర్​ ను కూడా కలిశారన్నారు. చైనా కమ్యూనిస్టులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం వివరాలు కూడా త్వరలోనే బయటపెడతామన్నారు. శ్యామ్​ పిట్రోడాకు చైనా చాలా మంచి మిత్రదేశమని విమర్శించారు. కాంగ్రెస్​ నాయకుడు మణిశంకర్​ అయ్యర్​ కూడా ప్రధాని మోదీని ఓడించేందుకు పాక్​ సహాయం కోరారని విమర్శించారు.