సిమ్​ వినియోగదారులకు డాట్​ హెచ్చరిక!

Dot warning for SIM users!

Feb 28, 2025 - 16:22
 0
సిమ్​ వినియోగదారులకు డాట్​ హెచ్చరిక!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ లోని 120 కోట్ల మొబైల్​ వినియోగదారులకు డీవోటి (డాట్​–డిపార్ట్​ మెం ఆఫ్​ టెలికమ్యూనికేషన్​) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. జరుగుతున్న మోసాల నేపథ్యంలో తమ పేరుమీదనే సిమ్​ లు ఉన్నాయా? లేదా? అనేది చెక్​ చేసుకోవాలని తెలిపింది. ఇంటర్నెట్​ వినియోగం, స్మార్ట్​ ఫోన్​ లు, యాప్​ ల పెరుగుదల వల్ల తెలియని లింక్​ ల ద్వారా సైబర్​ మోసాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది.  మోసాలను నివారించడానికి డాట్​ చర్యలు తీసుకుంటుందని, అయినా వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. డీవోటీ వీడియోలో పలు వివరాలను పంచుకున్నామని వాటిని వీక్షించాలని తెలిపింది. సైబర్​ నేరస్థులు వినియోగదారుల పత్రాలను సేకరించి వాటి ద్వారా సిమ్​ కార్డులను పొందుతున్నట్లు గుర్తించామని తెలిపింది. టెలికమ్యూనికేషన్ శాఖ సంచార్ సత్తి పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీ పేరుపై నడుస్తున్న అన్ని సిమ్ కార్డుల గురించి వివరాలను మీరు సులభంగా పొందవచ్చని డీవోటి వివరించింది.