రక్షణ రంగం మరింత బలోపేతం
ఎయిర్ బస్ – టాటా భాగస్వామ్యం
దక్షిణాదిన భారం.. సరిహద్దుల్లోనే చవక!
ప్లాంట్ ను వడోదరాలో ప్రారంభించిన భారత్–స్పెయిన్ దేశాల ప్రధానులు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: సీ–295 ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ భారత్ లో ఏర్పాటైంది. ఇక ఉత్పత్తి, ఎగుమతులు ఈ విమానానికి సంబంధించి భారత్ నుంచే జరగనున్నాయి. ఈ ఫ్యాక్టరీ గుజరాత్ లో ఎయిర్ బస్, టాటా భాగస్వామ్యంలో ఏర్పాటయ్యింది. ఈ ప్రాజెక్టు రాకతో మూడు వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించనుండగా, పరోక్షంగా మరికొంతమందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. స్పెయిన్–భారత్ భాగస్వామ్యంలో ఈ సంస్థను వడోదరాలో స్థాపించారు. దీంతో ఏవియేషన్ పరిశ్రమలో భారత్ భారీ అడుగులు వేసింది. దీంతో భారత్ రక్షణ రంగంలో బలోపేతంతో పాటు ఆర్థికంగా మరింత బలపడనుంది.
ప్రధాని మోదీ మేకిన్ ఇండియాలో భాగంగా ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ గా రూపుదిద్దుకోనుంది. సీ–295 ట్రూప్ ట్రాన్స్పోర్ట్, కార్గో ఎయిర్లిఫ్ట్, వైద్య సహాయం, సముద్ర గస్తీలలో ఈ విమానాలు కీలకంగా మారనున్నాయి. అనేక మిషన్ లలో ఈ విమానాన్ని ఉపయోగించనున్నారు. ఈ విమానం చిన్న రన్ వేల నుంచి కూడా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా చైనా–భారత్ సరిహద్దు వెంట ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఈ విమానాలు కీలకం కానున్నాయి. ఈ వమానంఓ ఒకేసారి 71 మంది సైనికులు/48 పారాట్రూర్ లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆత్మనిర్భర్ లో భాగంగా దేశీయంగా ఈ విమానాన్ని ఉత్పత్తి చేయడంలో దేశీయ అవసరాలకే గాక తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఎగుమతులు చేయడం వంటి వాటితో భారత రక్షణ రంగం మరింత పటిష్ఠం కానుంది.
కాగా స్పెయిన్ ద్వారా 56 విమానాల అందజేతకు ఒప్పందం జరిగింది. తొలివిడతగా 16 విమానాలను భారత్ కు అప్పగించనుండగా, 40 విమానాలను మాత్రం టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ ఎయిర్ బస్ సహకారంతో వడోదరలో రూపొందించనుంది. ప్రస్తుతం వరకు సీ–295 విమానాలు ఐదు భారత్ కు అందించారు. ప్రాజెక్టు ద్వారా పూర్తి విమానాల తయారీకి 2031 సమయం పట్టనుంది.
ప్రస్తుతం ఎయిరో స్పేస్ రంగం బెంగళూరు, హైదరాబాద్, బెల్గాం వంటి దక్షిణాది ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నా ఇక్కడి నుంచి ట్రాన్స్ పోర్టేషన్ సరిహద్దుల వరకూ చేరిక, అక్కడి నుంచి తరలింపు తలకుమించిన భారంగా మారడంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా ఇటువంటి ప్లాంట్లను నెలకొల్పితే సౌకర్యవంతంగా ఉంటుందని భావించి గుజరాత్ లోని వడోదరాలో ఈ ప్లాంటును నెలకొల్పింది.
రెండు రోజుల క్రితమే (సోమవారం) స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీ–295 ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించారు.