కేజ్రీకి వ్యతిరేక పవనాల సెగ

బీజేపీ, కాంగ్రెస్​ విమర్శలు

Mar 5, 2025 - 18:54
 0
కేజ్రీకి వ్యతిరేక పవనాల సెగ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్​ కు వ్యతిరేక పవనాల సెగ తగులుతుంది. పంజాబ్​ వెళ్లిన ఆయనపై బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు విమర్శలు గుప్పించాయి. బుధవారం బీజేపీ, కాంగ్రెస్​ స్థానిక నేతలు మీడియాఓ మాట్లాడుతూ.. శీష్​ మహల్​ పై విమర్శల బాణాలు సంధించాయి. భారీ కాన్వాయ్​ తో ఆయన పంజాబ్​ వెళ్లడం వెనుక ఏదో మర్మం ఉందని ఆరోపించాయి. సామాన్యుడిగా మాములు కారులో తిరిగిన ఆయనకు ల్యాండ్​ క్రూయిజర్​ లాంటి ఖరీదైన వాహనాలు ఎక్కడివని నిలదీశాయి. పంజాబ్​ ప్రభుత్వ కాన్వాయ్​ లో తిరగడం ఏంటని విమర్శించాయి. ఇప్పటికే అధికారాన్ని చేజార్చుకొని ఘోరంగా విఫలమయ్యాడని విమర్శించారు. పంజాబ్​ ప్రభుత్వం కేజ్రీవాల్​ భద్రతకు నిధులు సమకూర్చడంపై మండిపడ్డారు. కేజ్రీవాల్ అధికార విలాసాలను వదులుకోలేకపోతున్నారని మండిపడ్డాయి.