32మంది భారత మత్స్యకారులు అరెస్ట్
ఐదు బోట్లు స్వాధీనం

వెల్లడించిన శ్రీలంక నావికాదళం
చెన్నై: శ్రీలంక నావికాదళం 32 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను స్వాధీనం చేసుకుంది. శ్రీలంక సముద్ర జలాల్లోకి ఫిషరీస్ బూట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించి చేపలు పడుతున్నట్లు నేవీ అధికారులు భారత నేవీకి ఆదివారం సమాచారం అందించారు. 2025లో ఇప్పటివరకు శ్రీలంక నావికాదళం 131 మంది భారత జాలర్లను అరెస్టు చేశారు. 18 పడవలను స్వాధీనం చేసుకున్నారు. మన్నార్ కుఉత్తరాన చేపట్టిన ఆపరేషన్ లో వీరిని అరెస్టు చేసినట్లుగా తెలిపింది. మత్స్యకారులను వారి పడవలను తలైమన్నార్ పీర్ కు తీసుకువచ్చామని, చట్టపరమైన చర్యల కోసం వారిని మన్నార్ ఫిషరీస్ అధికారులకు అప్పగిస్తామని నేవీ స్పష్టం చేసింది.