శరణార్థి ముసుగులో ఉగ్రముఠాలు

Terrorist gangs in the guise of refugees

Feb 23, 2025 - 17:45
 0
శరణార్థి ముసుగులో ఉగ్రముఠాలు

వెస్ట్​ బ్యాంక్​ లో యుద్ధట్యాంకులు
ఇజ్రాయెల్​ రక్షణ మంత్రి కాట్జ్​ 

జెరూసలెం: వెస్ట్​ బ్యాంక్​ లోని కొన్ని పట్టణాల్లో శరణార్థి శిబిరాల ముసుగులో కొన్ని ఉగ్రవాద ముఠాలు ఉన్నట్లు తెలుస్తుందని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా తుదముట్టించే వరకు తమ దేశ సైన్యాన్ని పాలస్తీనా భూభాగంలో సిద్ధంగా ఉండాలని ఆదేశించామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్​ చెప్పారు. ఆదివారం మీడియాతో కాట్జ్​ మాట్లాడారు. వెస్ట్​ బ్యాంక్​ లోని కొన్ని ప్రాంతాల్లో దాడులను ముమ్మరం చేస్తామని, మరిన్ని యుద్ధ ట్యాంకులను పంపుతున్నట్లు తెలిపారు. కాగా గురువారం రాత్రి ఇజ్రాయెల్​ లోని మూడు బస్సులపై జరిగిన బాంబుదాడులకు ప్రధాన సూత్రధారులు ఇక్కడి నుంచే ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అక్కడ ఉన్న ఉగ్రనాయకుల వేటకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు పాలస్తీనా ఖైదీలను ఇప్పుడప్పుడే విడుదల చేయబోమని ఇజ్రాయెల్​ స్పష్టం చేసింది. తమ బందీలను అవమానకర రీతిలో అప్పజెప్పడం ఆపాలని ఇజ్రాయెల్​ హమాస్​ కు స్పష్టం చేసింది. కాగా ఇజ్రాయెల్​ తీసుకుంటున్న చర్యల పట్ల మరోమారు మధ్యవర్తిత్వ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి, రెడ్​ క్రాస్​ వర్గాల అధికారులు పెద్ద ఎత్తున ప్రభుత్వంతో చర్చలకు దిగినట్లు సమాచారం.