అఖ్నూర్​ దాడి ప్రాణనష్టం అవాస్తవం

The loss of life in the Akhnoor attack is unreal

Feb 27, 2025 - 15:34
 0
అఖ్నూర్​ దాడి ప్రాణనష్టం అవాస్తవం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ అఖ్నూర్​ లో భద్రతా దళాల వాహనంపై జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగిందనే వార్తల్లో నిజం లేదని అధికారులు గురువారం ప్రకటించారు. ఇవన్నీ ఫేక్​ వార్తలే అన్నారు. ఉగ్రదాడి ఫలించలేదని, భద్రతా దళాలూ వెంటనే అప్రమత్తం కావడంతో వారు తప్పించుకున్నారని అన్నారు. ప్రాణనష్టంపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సైనికులంతా సురక్షితంగానే బయటపడ్డారని, చుట్టుపక్కల ప్రాంతాల్లో సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టామన్నారు. కాల్పులు జరిగిన వెంటనే జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ఉగ్రవాదులు పారిపోయారని, వారి కోసం సెర్చింగ్​ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. సరిహద్దుల వెంట ఉగ్రచొరబాట్లను అడ్డుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే పూంచ్​ సెక్టార్​ సరిహద్దు నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన ఐదుగురిని మట్టుబెట్టామని చెప్పారు.