ప్రజల వద్దే రూ. 2000 నోట్లు రూ. 6,471 కోట్లు!

People have Rs. 2000 notes of Rs. 6,471 crores!

Mar 1, 2025 - 18:24
 0
ప్రజల వద్దే రూ. 2000 నోట్లు రూ. 6,471 కోట్లు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇంకా ప్రజల వద్దే రూ. 6,471 కోట్ల విలువైన రూ. 2000 నోట్లు ఉన్నాయని ఆర్భీఐ శనివారం డేటాను వెల్లడించింది. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు 2023 అక్టోబర్​ 7 అన్ని బ్యాంకు శాఖలలో అవకాశం ఇచ్చింది. రూ. 3.56 లక్షల కోట్లలో 2025 ఫిబ్రవరి 28 నాటికి రూ. 2వేల నోట్లు రూ. 6,471 కోట్లుగా ఉందని ప్రకటించింది. ఇప్పటికీ నోట్ల మార్పిడి సౌకర్యం రిజర్వ్​ బ్యాంకు 19 శాఖల్లో ఉన్నట్లు తెలిపింది. 98.18 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది. అంతకుముందు ఆర్బీఐ ప్రకటించిన నివేదికలో రూ. 2 వేల నోట్లు రూ. 6,577 కోట్లుగా ప్రజల వద్దే ఉన్నాయి. రూ. 106 కోట్లు మాత్రమే బ్యాంకుకు వచ్చాయి.