1860లోనే తొలి భారత బడ్జెట్​!

అధికారికంగా 1947 నవంబర్​ 26న బడ్జెట్​!

Jan 31, 2025 - 15:27
 0
1860లోనే తొలి భారత బడ్జెట్​!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: సిపాయిల తిరుగుబాటు 1857 తరువాత భారత్​ దేశ తొలి బడ్జెట్​ ప్రవేశపెట్టారని తెలుసా? అవును ఇది నిజ్జంగా నిజమే! ఈ బడ్జెట్​ ను దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా వేల కిలోమీటర్ల దూరంలోని లండన్​ బ్రిటిష్​ క్రౌన్​ ముందు సమర్పించారు. సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్​ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. దీంతో భారీ నష్టం కూడా చోటు చేసుకుంది. నష్టాలను భర్తీ చేసేందుకు భారత్​ లోనే పలు రకాల పన్నుల ను రూపకల్పన చేశారు. ఇందుకోసం బ్లూ ప్రింట్​ ను సిద్ధం చేశారు. ఈ బడ్జెట్​ బ్లూ ప్రింట్​ ను ఈస్టిండియా సంస్థ అధికారి జేమ్స్​ విల్సన్​ బ్రిటిష్​ క్రౌన్​ కు 1860 ఏప్రిల్​ 7న అందించారు. అప్పటి నుంచి చాలాకాలంపాటు ఇదే భారతదేశ తొలి బడ్జెట్​ గా పరిగణించారు. 1947 స్వాతంత్ర్యం అనంతరం నవంబర్​ 26న ఆర్​ కె షణ్ముగం చెట్టి తొలిసారి బడ్జెట్​ అధికారికంగా సమర్పించారు. కాగా 1860 బడ్జెటే తొలి బడ్జెట్​ గా పేర్కొంటున్నట్లు ఇప్పటికీ పలు రకాల దీనికి సంబంధించిన ఆధారాలు పుస్తకాల్లో ఉన్నాయి. కాగా ఈ బడ్జెట్​ లో విధించిన పన్నులను పలువరు ఖండించారు. 1886లో ప్రత్యేక ఆదాయపు పన్ను చట్టాన్ని ఆమోదించారు. కాగా సిపాయిల తిరుగుబాటు, వారిపై బ్రిటీష్​ దౌర్జన్యాలను పలువురు తీవ్రంగా ఖండించారు. బడ్జెట్​ లోని ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకించారు.