మెటా అండర్​ సీ కేబుల్​ ప్రాజెక్ట్​

డిజిటల్​ సేవలకు మరింత ఊతం

Feb 16, 2025 - 15:38
 0
మెటా అండర్​ సీ కేబుల్​ ప్రాజెక్ట్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ – అమెరికాల మధ్య గ్లోబల్​ డిజిటల్​ హైవే నిర్మాణం, కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మార్క్​ జుకర్​ బర్గ్​ సంస్థ వంద కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. ట్రంప్​–మోదీల మధ్య సమావేశం తరువాత మెటా ఈ నిర్ణయం తీసుకుంది. కనెక్టివిటీ కోసం మెటా సముద్ర గర్భంలో కేబుల్​ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 50వేల కి.మీ. పొడవైన కేబుల్​ ను వేయనున్నారు. హిందు మహాసముద్రంలో ఈ కేబుల్​ ద్వారా భారత్​–అమెరికాల మధ్య కనెక్టివిటీని మెరుగుపర్చనున్నారు. అండర్​ సీ కేబుల్​ ప్రాజెక్టు ఐదు ఖండాల మీదుగా కొనసాగనుంది. పెరుగుతున్న డిజిటల్​ సేవలకు డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా సంస్థ అధికారులు తెలిపారు. దీంతో సూపర్​ ఫాస్ట్​ డేటా బదిలీకి సహకారం అందనుంది. భారత్​ లో మెటాఫ్లాట్​ ఫారమ్​ ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రామ్​, వాట్సాప్​ లకు మిలియన్ల మంది వినియోగదారులున్నారు. ఈ నేపథ్యంలో సేవలను మరింత మెరుగుపర్చుకోవాలని సంస్థ భావిస్తూ ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేయాలని నిర్ణయించింది.