యూఎన్ ఎస్ సీలో చైనాకు చురకలు
China in the UNSC

న్యూయార్క్: యూఎన్ ఎస్ సీ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి)లో శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు వ్యతిరేకించే దేశాలు ప్రగతిశీల విధానాలకు వ్యతిరేకులని భారత్ పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. బుధవారం యూఎన్ ఎస్ సీ చైనా ఆధ్వర్యంలో జరిగిన భద్రతా సమావేశంలో భారత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పర్వతనేని హరీష్ ప్రసంగించారు. చైనా అనుసరిస్తున్న విధానాలపై దుమ్మెత్తి పోశారు. ఇకపై ఇలాంటి వైఖరులను ఆమోదించలేమన్నారు. చిన్నదేశాలు, గ్లోబల్ సౌత్ దేశాల పట్ల అన్యాయంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఐక్యరాజ్యసమితిలో చేరేందుకు పూర్తిగా అర్హులన్నారు. యూఎస్ఎస్ సీలో వెంటనే సంస్కరణలు జరగాలన్నారు. ప్రాథమిక సూత్రాలు అవసరమని చెప్పారు. ఈ చర్యలతో సభ్యుల సంఖ్య పెరగడమే గాకుండా, ఆయా దేశాల్లో సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇకపై పూర్తి పరిశీలన లేకుండా యూఎన్ ఎస్ సీలో దేశాల సభ్యత్వం కాదనే వాదనను అంగీకరించలేది లేదని చైనాకు చురకలంటించారు. గతేడాది యూఎన్ఎస్సీలో ప్రధాని మోదీ సంస్కరణలపై మాట్లాడిన విషయాలను ఆయన గుర్తు చేశారు.