ఆప్​ లో లుకలుకలు

పార్టీని వీడుతున్న స్థానిక నాయకులు

Feb 15, 2025 - 14:22
 0
ఆప్​ లో లుకలుకలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ స్థానిక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం పలువురు స్థానిక కౌన్సిలర్లు, సీనియర్​ ఆప్​ నాయకులు బీజేపీలో చేరారు. పార్టీలో అంతర్గత విబేధాలు కూడా తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పార్టీని వీడక తప్పలేదని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. పార్టీలో కేజ్రీవాల్​, అతిసి, సిసోడియాల ఒంటెద్దు పోకడలతో విసిగిపోయామని అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. బీజేపీలో చేరిన వారిలో న్యూ ఢిల్లీ మాజీ జిల్లా అధ్యక్షుడు సందీప్​ బసోయా, సిట్టింగ్​ కౌన్సిలర్లు అనితా బసోయా, నిఖిల్​ చప్రానా, ధరమ్​ వీర్​ లు ఆప్​ ను వీడారు.