స్పేస్ ఎక్స్ ప్రయత్నాన్ని జో బైడెన్ అంగీకరించలే
వ్యోమగాముల రిటర్న్ పై మస్క్ ఆరోపణలు

వాషింగ్టన్: సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమికి తీసుకువచ్చే ప్రతిపాదనకు జో బైడెన్ ప్రభుత్వం అంగీకరించలేదని ఎలన్ మస్క్ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ సహకారంతో ఇది సాధ్యపడిందన్నారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి రావడాన్ని ఆయన స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కు నాసా కృతజ్ఞతలు తెలిపింది. వ్యోమగాములను తీసుకురావడంలో మస్క్ స్పేస్ ఎక్స్ సహకారం మరువలేనిదన్నారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పేస్ ఎక్స్ ద్వారా వ్యోమగాములను సురక్షితంగా తీసుకువస్తామని ప్రతిపాదించి ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. కానీ ఆయన రాజకీయ కారణాలతో తమ మిషన్ ను పెండింగ్ లో పెట్టారన్నారు. అందువల్లే ఆలస్యం ఏర్పడిందన్నారు. లేకుంటే ఈ పాటికే వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేవారమని మస్క్ బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ సహకారం, నిర్ణయం వల్లే నేడు యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తుందని, ప్రశంసలు కురిపిస్తుందని ధన్యవాదాలు తెలిపారు.