ఉపరాష్ట్రపతి డిశ్చార్జీ
Vice President's discharge

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. బుధవారం డిశ్చార్జీ అయిన ఆయనకు కొద్దిరోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. మార్చి 9న ధంఖర్ శ్వాసకోస సంబంధిత, గుండె సంబంధిత అనారోగ్యంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన్ను పరామర్శించారు. ధంఖర్ అనారోగ్యానికి సంబంధించి ఎయిమ్స్ వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఆయన త్వరగా కోలుకున్నారు.