పుంజుకుంటున్న మార్కెట్లు రెండోరోజు లాభాలు

Rising markets post second day of gains

Mar 6, 2025 - 16:10
 0
పుంజుకుంటున్న మార్కెట్లు రెండోరోజు లాభాలు

ముంబాయి: ట్రంప్​ రాక.. పలు ప్రకటనలు, సుంకాల పెంపు, షేర్​ మార్కెట్​ నుంచి ఉపసంహరణలు, యుద్ధభయాలతో గత పది రోజులుగా నేలచూపులు చూసిన భారతీయ షేర్​ మార్కెట్​ రెండు రోజులుగా పైకి ఎగబాగుతుంది. మొత్తానికి బేర్​ దాడిని బుల్​ సమర్థవంతంగా ఎదుర్కోవడం నేర్చుకున్నట్లుందన్నట్లు మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో పెట్టుబడుల వరద మళ్లీ మొదలవుతుంది. గురువారం సెన్సెక్స్​ 73,817.65 (87.42), నిఫ్టీ 35.05 పాయింట్లు పెరిగి 22,372.35 వద్ద ముగిశాయి. దేశీయ మార్కెట్లు ఫ్లాట్​ గా ప్రారంభం అయినా చివరలో లాభాలను చవిచూశాయి. రూపాయి కూడా బలపడింది. మెటల్​, చమురు, గ్యాస్​ షేర్లలో పెరుగుదల నమోదైంది. చైనా ఉద్దీపన ప్యాకేజీ, ట్రంప్​ సుంకాలను పెంచే నిర్ణయాన్ని ఒక నెలపాటు వాయిదా వేయడం లాంటి సానుకూల నిర్ణయాలతో మార్కెట్లు బలపడ్డాయి.