ఎఎంయూలో హోలీకి నో!
No to Holi in AMU!

ఇఫ్తార్ లకు ఎలా అనుమతించారు
నిర్వహించి తీరుతాం బీజేపీ నేత శకుంతల వార్నింగ్
విషయాన్ని సీఎం యోగి దృష్టికి తీసుకువెళతా
లక్నో: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో హోలీ వేడుకలను జరుపుకోవద్దని విశ్వవిద్యాలయం ప్రకటించింది. దీంతో హిందూ విద్యార్థులు, బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం యూనివర్సిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. గత నెల 25నే విద్యార్థులు హోలీ వేడుకల నిర్వహణపై లేఖను సమర్పించి పరిపాలన అనుమతిని కోరారు. దీనికి ప్రతిగా ఎఎంయూ వైస్ చాన్స్ లర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాలయ ప్రొఫెసర్లు, డీన్లు పాల్గొన్నారు. క్యాంపస్ లో నూతన సాంప్రదాయాన్ని పాటించరాదని సమావేశం నిర్ణయించినట్లు చెప్పారు. ఎఎంయూ ప్రతీ హాస్టల్ లో, భవనంలో ఇఫ్తార్ విందులు ఇస్తుండగా, తమ పర్వదినం నిర్వహించుకుంటామంటే ఎందుకు నిరాకరిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈద్, మొహర్రం, ఇతర ఊరేగింపులకు అనుమతిస్తూ తమ పండుగలకు అనుమతినీయరా? అని ప్రశ్నించాయి. ఎఎంయూ వీసీ వెంటనే అనుమతినీయాలని కోరారు.
ఈ విషయంపై ప్రొఫెసర్ మహ్మద్ వసీం అలీ మాట్లాడుతూ.. దరఖాస్తు అందిందని, వైస్ చాన్స్ లర్ కు పంపించామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమ నిర్వహణకు ఇంతకు ముందు కూడా అనుమతి లేదని, ప్రస్తుతం కూడా అనుమతించలేదన్నారు.
అనుమతి మంజూరు చేయకపోవడంపై బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఇది పాకిస్థాన్ కాదన్నారు. విశ్వవిద్యాలయం ఎవరి వ్యక్తిగత ఆస్తికాదన్నారు. ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, హిందువులకు ఎలాంటి హక్కు లేదన్నారు. హోలీకి అనుమతించకపోతే ఈద్ కూడా నిర్వహించుకోవదన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. హోలీ ఐక్యత, ప్రేమ, త్యాగాలకు చిహ్నామన్నారు. తాను సీఎం యోగి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతానని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలను నిర్వహించి తీరుతామని హెచ్చరించారు.