ముఖ్యాంశాలు

Highlights

May 9, 2025 - 17:47
 0
ముఖ్యాంశాలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: దేశ, అంతర్జాతీయ పరిణామాలు శుక్రవారం.. 

–  రష్యా మాస్కోవిజయ దినోత్సవ వేడుకల్లో పుతిన్‌తో కలిసి పాల్గొన్న 27 దేశాల నాయకులు. ఈ కార్యక్రమంలో భారత్​ తరఫున ప్రధాని మోదీ వెళ్లాల్సి ఉన్నా భారత్​–పాక్​ యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పర్యటనను రద్దు చేసుకున్నారు.

 – చండీగఢ్‌లోని దుకాణాలు, రెస్టారెంట్లు, మార్కెట్లు శుక్రవారం సాయంత్రం 7 గంటలకే మూసివేయాలని ఆదేశించారు. 

– మనం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నామని అమెరికాలో భారత రాయబారి క్వాత్రా అన్నారు. మానవాళికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా పరిగనించారు. 

– గుజరాత్‌లో మే 15 వరకు అన్ని రకాల కార్యక్రమాల్లో డ్రోన్లు, బాణసంచాపై పూర్తి నిషేధం విధించారు.

– 24 కి పైగా నగరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ నిన్న రాత్రి 500 డ్రోన్లను ప్రయోగించింది. భారత్​ భారీ ఎత్తున ఈ దాడులను తిప్పికొట్టింది.

– భారత ముస్లింలు పాకిస్థాన్‌ను ద్వేషిస్తారని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. దేశం పట్ల తనకున్న ప్రేమను చాటారు. పాక్​ తో దేశ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 
 
– పాకిస్తాన్‌తో ఉద్రిక్తత కారణంగా జమ్మూ కాశ్మీర్‌లోని పాఠశాలలు మే 12 వరకు మూసివేశారు. 

– ఐపీఎల్​ 2025ను వాయిదా వేశారు. షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్నారు. 

– విదేశాంగ మంత్రి జైశంకర్ యుకె విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్​ ఉగ్రవాదాన్ని ఎండగట్టారు. భారత్​ ఇక వెనక్కి తగ్గబోదన్నారు.

– బెంగాల్‌లోని బిర్భూమ్‌లో జమాత్- ఉల్ -ముజాహిదీన్ బంగ్లాదేశ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 

– పాక్​ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ, హోం, ఆర్థిక, ఆరోగ్య మంత్రిత్వ శాఖల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో భారీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వెంటనే మెడికల్​ క్యాంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో వైద్యం శీఘ్రంగా అందనుంది.

– ముంబాయి భద్రత కోసం కోస్ట్​ గార్డ్​ నేవీ పోలీసులు కలిసి పనిచేస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీలో అలర్ట్​ కోసం సైరన్​ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాజధాని నగరం కాబట్టి పెద్ద ఎత్తున చరిత్ర కలిగి ఉన్న భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

 – పహల్గామ్​ దాడి బాధితులకు న్యాయం చేకూర్చేందుకు భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టిందని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్​ భగవత్​ అన్నారు.

– భారత్​–పాక్​ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇమ్రాన్​ ఖాన్​ విడుదలకు కోర్టులో పిటిషన్​ దాఖలైంది. 

– జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ ఆఫీసర్ మనోజ్ సిన్హా ఉరీ చేరుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని పాక్​ దుశ్చర్యలను ఎండగట్టారు.

– త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ రెండు గంటలపాటు సమావేశం నిర్వహించారు. 
 
– పంజాబ్​ ప్రభుత్వం ఐఏఎస్​, ఐపీఎస్​ అందరూ అధికారుల సెలవులను రద్దు చేసింది. అత్యవసరంగా విధుల్లో చేరాలని ఆదేశించింది.
 
– సరిహద్దు పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు రక్షణ మంత్రి, రా తో ఆరా తీస్తున్నారు.