26/11 దోషి రాణా పిటిషన్​ తిరస్కరణ!

26/11 convict Rana's petition rejected!

Mar 7, 2025 - 12:43
 0
26/11 దోషి రాణా పిటిషన్​ తిరస్కరణ!

అనారోగ్య కారణాల సాకుతో భారత్​ కు అప్పగించొద్దని వాదన
తిరస్కరించిన న్యాయమూర్తి ఎలెనా కగన్​

వాషింగ్టన్​: 26/11 దాడుల ముంబాయి దాడుల దోషి తహవ్వూర్​ రాణాను భారత్​ కు అప్పగించొద్దని దాఖలైన పిటిషన్​ ను అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాణా తరఫున అతని సోదరుడు ఈ పిటిషన్​ ను కోర్టులో దాఖలు చేశాడు. రాణాను భారత్​ కు అప్పగిస్తే విచారణ పేరుతో హింసిస్తారని, చంపేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే రాణా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నాడని భారత్​ లో జీవించలేని పరిస్థితులు కల్పిస్తారని వాదించారు. రాణాను భారత్​ కు అప్పగించే అత్యవసర నిర్ణయంపై వెంటనే స్టే విధించాలని పిటిషన్​ లో కోరారు. పిటిషన్​ ను విచారించిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలెనా కగన్​ రాణా పిటిషన్​, వాదనలు అంగీకరించలేదు. పిటిషన్​ ను తిరస్కరించారు. 2009లో ఎఫ్​ బీఐ రాణాను అరెస్టు చేసింది. అమెరికా కోర్టులో లష్కరే తోయిబాకు మద్ధతు ఇచ్చినందుకు దోషిగా నిర్ధరించింది. ప్రస్తుతం రాణా లాస్​ ఏంజెల్స్​ జైలులో ఉన్నాడు. కాగా గతంలోనూ పలుమార్లు బెయిల్​​, భారత్​ కు అప్పగించొద్దని పిటిషన్​ లు దాఖలు చేసుకున్నా అమెరికలోని వివిధ కోర్టులు పిటిషన్లను కొట్టివేశాయి.
ముంబాయి దాడిలో తహవ్వూర్​ రాణా పై 405 పేజీల చార్జీ షీట్​ దాఖలైంది. లష్కరే తోయిబా ఉగ్రవాది. దాడిలో ప్రధాన సూత్రధారి డేవిడ్​ కోల్మన్​ హెడ్లీకి సహాయం చేశాడు. ఇతను పాక్​ కు చెందిన వ్యాపారవేత్త. కెనడాలో స్థిరపడ్డాడు. పాక్​ సైన్యంలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. 1997లో కెనడాకు వెళ్లి అక్కడి ఇమ్మిగ్రేషన్​ సేవలను అందించే వ్యాపారవేత్తగా పనిచేశాడు.