హెచ్ సీఎల్ పనితీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష
Union Minister Kishan Reddy's review on the performance of HCL

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హెచ్ సీఎల్ (హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్) పనితీరుపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్షించారు. బుధవారం న్యూ ఢిల్లీలోని ఆ శాఖ కార్యాలయం శాస్త్రిభవన్ లో హెచ్ సీఎల్ సీఎండీతో భేటీ అయ్యారు. సీఎండీ సంజీవ్ కుమార్ సింగ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ పనితీరుకు మరింత ఊతం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆ సంస్థ పనితీరుపై అధికారులతో కలిసి సమీక్షించారు. సంజీవ్ కుమార్ తోపాటు సతీష్ చంద్ర దూబే, వి.ఎల్.కాంతారావు, సంజయ్ లోహియా, ఇతర సీనియర్ అధికారులతో మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హెచ్ సీఎల్ విస్తరణ, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి పెంపుదలపై మరింత దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు.