రామేశ్వరం కేఫ్పేలుడు.. 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
అదుపులో మరో ఐదుగురు అనుమానితులు

బెంగళూరు: బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు కేసులో ఐసీస్, లష్కర్ – ఏ – తోయిబాతో సంబంధాలున్న పలువురి ఇళ్లపై ఎన్ఐఏ మంగళవారం దాడులు చేసింది. 17 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఐసీస్ సానుభూతి పరుడు నజీర్ ఇంటిపై దాడి చేసింది. కేఫ్లో పేలుడుకు ఇతనే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడుకు ప్రధాన సూత్రధారి జూనైద్అనే అనుమానం కూడా ఉంది. హవాలా లావాదేవీలకు సంబంధించి జూనైద్పై ఇప్పటికే కేసు నమోదు కాగా అతను బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రామనాథపురంలోని షంఫుద్దీన్ ఇంటిపై దాడులు నిర్వహించారు. సిద్దార్పేట్, బిద్వార్ కు చెందిన ఐదుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. విచారిస్తున్నందున వీరి వివరాలను వెల్లడించలేదు. ఈ ముగ్గురికి లష్కరే తోయిబాతో కూడా సంబంధాలున్నాయని ఎన్ఐఏ స్పష్టం చేసింది. నజీర్ సహచరులు జూనైద్ అహ్మద్, సల్మాన్ఖాన్లు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. 2023 జూలై 18న వీరి ఇళ్లపై దాడి సందర్భంగానే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, హ్యాండ్గ్రెనేడ్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేఫ్లో పేలుడుకు పాల్పడ్డ వ్యక్తి టైమర్ ద్వారా బాంబును పేల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు ముందు నిందితుడి పూర్తి కదలికలను సీసీ టీవీ ద్వారా దర్యాప్తు సంస్థలు, పోలీసులు పరిశీలించారు.