స్ఫూఫ్డ్ కాల్స్ లో 97 శాతం తగ్గుదల
97 percent reduction in spoofed calls

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సైబర్ క్రైమ్ ఫిర్యాదులు దేశవ్యాప్తంగా 19 లక్షలను దాటాయని స్ఫూఫ్డ్ కాల్స్ లో 97 శాతం తగ్గుదల నమోదైందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ శాఖలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. 2024కు సంబంధించి ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో సైబర్ నేరాలకు సంబంధించిన 19.18 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని, వీటివల్ల రూ. 22,811.95 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని కమ్యూనికేషన్స్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో టెలికాం మోసాలను అరికట్టేందుకు డాట్, అంతర్జాతీయ స్ఫూఫ్డ్ కాల్ లను గుర్తించి బ్లాక్ చేయడానికి ఒక వ్యవస్థను ప్రారంభించింది. ప్రారంభించిన 24 గంటల్లోనే 1.35 కోట్ల మోసపూరిత కాల్ లను బ్లాక్ చేశామన్నారు. 2025 మార్చి నాటికి బ్లాక్ కాల్ ల సంఖ్య 4 లక్షలకు తగ్గిందని 97 శాతం తగ్గుదల సూచిస్తుందని చెప్పారు.