హిజ్బుల్లా చీఫ్ గా నయీమ్ ఖాసిం
Naeem Qasim as Hezbollah chief

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హిజ్బుల్లా నూతన చీఫ్ గా నయీమ్ ఖాసిం ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇతను ఇరాన్ లో ఉన్నాడు. ఇజ్రాయెల్ వరుసగా హిజ్బుల్లా, హమాస్ ఉగ్రవాద నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు ఉగ్రసంస్థలే గాక హౌతీ, ఇరాన్ లకు కూడా భారీగానే నష్టం వాటిల్లింది. గాజా, లెబనాన్ దేశాలు సుమారుగా భస్మీపటలంగా మారుతున్నాయి. ఆ దేశాల్లో ప్రజలు నివసించే పరిస్థితులు రోజురోజుకు గగనమవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఐడీఎఫ్ రాడార్ లో నయీమ్ ఖాసిం ఉన్నారు. మరోవైపు నయీమ్ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ప్రకటించే వరకు హిజ్బుల్లా తమ కార్యకలాపాలను ఆపాబోదని హెచ్చరించారు. నయీమ్ 1970లో రసాయన శాస్ర్త విద్యార్థి. 1974 నుంచి 1988 వరకు ఇస్తామిక్ విద్యకు అధిపతిగా పనిచేశారు. 1991లో హిజ్బుల్లాకు డిప్యూటీ సెక్రెటరీ జనరల్ గా ఎన్నికయ్యాడు.