రెండు గూడ్స్ రైళ్లు ఢీ డ్రైవర్, కో పైలెట్ కు తీవ్ర గాయాలు
Two goods trains hit the driver and co-pilot with serious injuries

లక్నో: యూపీలోని ఫతేపూర్ లో ఒకే ట్రాక్ పై రెండు గూడ్స్ రైళ్లు ఢీకున్నాయి. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్, కో పైలెట్ లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో ఒక గూడ్స్ రైలు ఇంజిన్ పూర్తిగా పట్టాలు తప్పి తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదంపై ఖాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన డ్రైవర్, కో పైలెట్ లను ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నారు.