హిందుజా చేతికి రిలయన్స్​ క్యాపిటల్​

ఉత్తర్వులు జారీ చేసిన లా ట్రిబ్యునల్​

Feb 11, 2025 - 16:26
 0
హిందుజా చేతికి రిలయన్స్​ క్యాపిటల్​

ముంబాయి: అనిల్​ అంబానీకి చెందిన రిలయన్స్​ క్యాపిటల్​ గ్రూప్​ సంస్థను హిందూజా గ్రూప్​ సొంతం చేసుకుంది. ఇక నుంచి ఈ క్యాపిటల్​ సంస్థ సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను హిందూజా సంస్థనే చూసుకోనుంది. ఇందుకు సంబంధించి జాతీయ లా ట్రిబ్యునల్​ ఆమోదించింది. 2021 నవంబర్​ లోనే అనిల్​ అంబానీకి చెందిన రిలయన్స్​ క్యాపిటల్​ బోర్డును రిజర్వ్​ బ్యాంక్​ రద్దు చేసింది. అనంతరం సంస్థ లావాదేవీలను పర్యవేక్షించేందుకు నాగేశ్వర్​ రావును నియమించింది. ఈయన కంపెనీ కొనుగోలుకు సంబంధించి 2022 ఫిబ్రవరి లో బిడ్లను ఆహ్వానించారు. దీంతో ఐఐహెచ్​ఎల్​ (ఇందూస్​ లాండ్​ ఇంటర్నేషనల్​ హోల్డింగ్​ లిమిటెడ్​–హిందూజా గ్రూప్​) ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ. 2,750 కోట్లను చెల్లించింది. మరో రూ. 3వేల కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది. మొత్తం రూ. 9,861 కోట్లు చెల్లించేందుకు హిందూజా సంస్థ ఓకే చెప్పింది. దీంతో రిలయన్స్​ క్యాపిటల్స్​ కు రుణాలు అందజేసిన సంస్థల ఆందోళనలు పూర్తిగా పరిష్కారం లభించింది. కాగా ఫిబ్రవరి 26 నాటికి రియలన్స్​ క్యాపిటల్​ కొనుగోలుకు హిందూజా గ్రూప్​ నకు మార్గం సుగమమైంది. పూర్తిస్థాయి పర్యవేక్షణను ఆ తరువాతే చేపట్టనుంది.