నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్ బీఐ ఎంపీసీ సమావేశం (ద్రవ్య పరపతి సంఘం) సోమవారం ప్రారంభమైంది. పాలసీ రేటును 0.25 శాతం తగ్గిస్తారా? లేదా? అనే దానిపై దేశవ్యాప్తంగా ఆశలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున పాలసీ రేటును తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎంపీసీ సమావేశం అక్టోబర్ 1 వరకు కొనసాగనుంది. కాగా సమావేశంలోని నిర్ణయాలను సోమవారమే ప్రకటించనున్నారనే ఆశావహులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, వృద్ధిని పెంచడం మధ్య సమతుల్యతలను సాధించడంపై కమిటీ చర్చిస్తుంది. అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశ ఫలితాన్ని బుధవారం వెల్లడించనున్నారు.
గత ఆగస్టులో జరిగిన విధాన సమావేశంలో, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 5.5 శాతం నుంచి మార్చలేదు. కాగా దేశీయంగా ప్రధాన బ్యాంకు ఎస్ బీఐ 0.25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపును ఆశిస్తుంది. దీంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. యూబీఐ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) 0.25 బేసిస్ పాయింట్ల రేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తుంది.
కాగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల సవరణపై ఆధారపడి ఉంటుంది. ఈసారి రేటు నిర్ణయం మాత్రమే కాకుండా, కమిటీ కమ్యూనికేషన్ కూడా కీలకం కానుంది.