భారత్–భూటాన్ రెండు రైల్వే ప్రాజెక్టులు
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–భూటాన్ మధ్య రెండు నూతన రైలు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇరుదేశ ప్రభుత్వాలు బనార్హత్ (పశ్చిమ బెంగాల్)ను సామ్త్సేతో కోక్రాఘర్ (అసోం)ను గెలేపుతో అనుసంధానించే రెండు క్రాస్ బోర్డర్ రైలు లింక్ లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రూ. 4,033 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. భారత్–భూటాన్ పరస్పర గౌరవం, విశ్వాసం, అవగాహనతో కూడిన సంబంధాన్ని పంచుకుంటున్నాయన్నారు. గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా రైలు లింక్ ఏర్పాటు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్టులు భారత రైల్వే నెట్వర్క్తో ప్రారంభమవుతాయని వైష్ణవ్ పేర్కొన్నారు. సుమారు రూ. 4,033 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించబడిందని ఆయన పేర్కొన్నారు. ఈ చొరవ కింద 89 కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ నిర్మించబడుతుందని రైల్వే మంత్రి పేర్కొన్నారు.