తొక్కిసలాట.. కరూర్​ కు రిటైర్డ్​ న్యాయమూర్తి

Stampede.. Retired judge to Karur

Sep 28, 2025 - 18:28
 0
తొక్కిసలాట.. కరూర్​ కు రిటైర్డ్​ న్యాయమూర్తి

చెన్నై: కరూర్​ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్​ రిటైర్ న్యాయమూర్తి అరుణ జగదీశన్​ తమిళనాడు తిరుచ్చికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి కరూర్​ కు రోడ్డు మార్గం ద్వారా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను మీడియా పలు ప్రశ్నలను సంధించింది. న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఘటన విచారకరమన్నారు. భవిష్యత్​ లో ఇలాంటి లోపాలు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనేదే కమిషన్​ ముఖ్యోద్దేశ్యమన్నారు. అవసరమైన పరిష్​కార మార్గాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తామన్నార. ప్రస్తుతం జరిగిన ఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలుసుకుంటానని చెప్పారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా దర్యాప్తు నివేదికను అందజేస్తానని చెప్పారు.