దీపావళికి ముందే ఏడు కొత్త రైళ్లు!

Seven new trains before Diwali!

Sep 29, 2025 - 14:53
 0
దీపావళికి ముందే ఏడు కొత్త రైళ్లు!
పాట్నా: దీపావళి, ఛత్​ కు ముందు బిహార్​ లో ఏడు కొత్త రైళ్లు పట్టాలెక్కాయి. ఇందులో మూడు అమృత్​ భారత్​ రైళ్లు కూడా ఉన్నాయి. సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్​ చౌదరి పలు రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రైళ్లను ప్రారంభించిన విషయాన్ని డిప్యూటీ సీఎం సామ్రాట్​ చౌదరి మీడియాతో పంచుకున్నారు. రాష్ర్ట ప్రజలకు సులభమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందన్నారు. గతంలో బిహార్​ రైల్వే బడ్జెట్​ రూ. 1,000 కోట్లుగా ఉండేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో రూ. 10,000 కోట్లకు పెరిగిందన్నారు. రాష్ర్ట ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సమగ్రమైన, దార్శనిక విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మనముందు ఉంచారని సంతోషం వ్యక్తం చేశారు.
 
ప్యాసింజర్​ రైళ్లు..
– రైలు నెం. 75271/75272 నవాడా-–పాట్నా, వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు నంబర్ 75273/75274 ఇస్లాంపూర్-–పాట్నా వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు నంబర్ 53201/53202 పాట్నా–-బక్సర్ వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు నం. 53203/53204 ఝఝా-దానాపూర్-–ఝఝా ఫాస్ట్ ప్యాసింజర్ వారానికి 6 రోజులు నడుస్తుంది.
 
అమృత్​ భారత్​ ఎక్స్​ ప్రెస్​..
రైలు నెం. 15293/15294 ముజఫర్‌పూర్-–చర్లపల్లి, రైలు నం. 19623/19624 మడోర్-–దర్భంగా-, రైలు నం. 15133/15134 ఛప్రా-–ఆనంద్ విహార్- పలు స్టేషన్ల మీదుగా నడవనున్నాయి.