కీవ్ పై విరుచుకుపడ్డ రష్యా
Russia lashes out at Kiev
500 డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులు
నలుగురు మృతి, 10మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా 500 డ్రోన్లు, 40కి పైగా క్షిపణులతో దాడులకు దిగింది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలంతా ఆయా చోట్ల బంకర్లలో తలదాచుకునేందుకు పరుగులు తీశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ దాడులు జరిగాయని కీవ్ సైనిక పరిపాలనాధికారి తైమూర్ తకాచెంకో ప్రకటించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందారని, 10 మంది గాయపడ్డారని తెలిపారు. దీంతో పోలాండ్ గగనతలాన్ని మూసివేశారని పేర్కొన్నారు. కీవ్ పై దాడికి ప్రతిస్పందనగా పోలాండ్ తన వైమానిక దళ జెట్ లను మోహరించింది. పలు స్థానిక మీడియా వార్తల ప్రకారం రష్యా డ్రోన్లు, యుద్ధవిమానాలు, రాకెట్ల శబ్ధాలు ప్రతిధ్వనించాయి. దీంతో ఉక్రెయిన్ వ్యాప్తంగా అలర్ట్ లో ఉండాలని ప్రకటించారు. ప్రజలు భూగర్భ రైల్వే స్టేషన్లను ఆశ్రయించారు. కాగా ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. మాస్కో దాడులను కొనసాగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనాలని కోరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఒత్తిడికి కూడా లొగ్గకపోతే పోరాటం కొనసాగిస్తామన్నారు.