ఢిల్లీ సమరానికి సై!
Ready to fight in Delhi!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు సై కొడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు గాను బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ 68 స్థానాలలో పోటీ చేస్తుండగా, ఆప్ 70, కాంగ్రెస్ 70, బీఎస్పీ 70, ఎన్సీపీ (శరద్ పవార్) 30 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎఐఎంఐఎం 12 స్థానాలు, సీపీఎం, సీపీఐ ఎంఎల్ చెరో రెండు స్థానాల్లో పోటీకి దిగాయి.
కాగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల విభాగం భారీ ఏర్పాట్లను చేసింది. 1.50 లక్షల మందిని ఎన్నికల విధులకు కేటాయించింది.
కాగా లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ లు ఏడు స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. బీజేపీ సింగిల్ గానే రంగంలోకి దిగి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీకి 54.7 శాతం ఓట్లు రాగా, ఆప్, కాంగ్రెస్ లకు కలిపి 43.3 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత భారీ ఓటింగ్ నమోదైంది. ఈ లెక్కన బేరీజు వేసుకుంటే బీజేపీకి ప్రజామద్ధతు భారీగా పెరిగిందనేది స్పష్టం అవుతుంది. ఈ ఎన్నికల్లో పేరుకే ట్రయాంగిల్ పోటీ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నిజమైన పోటీ మాత్రం బీజేపీ, ఆప్ మధ్యేనని ఓటర్లు తమ మనోగతాన్ని మీడియాతో చెబుతుండడం గమనార్హం.