రాహుల్​ అనుచిత వ్యాఖ్యల కేసు వాయిదా

Rahul's inappropriate comments case adjourned

Jan 22, 2025 - 18:32
 0
రాహుల్​ అనుచిత వ్యాఖ్యల కేసు వాయిదా

లక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై రాహుల్​ గాంధీ అనుచిత వ్యాఖ్యల కేసు జనవరి 30కి వాయిదా పడింది. యూపీలోని సుల్తాన్​ పూర్​ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో బుధవారం ఈ కేసుపై కోర్టు ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంది. కాగా కోర్టులో న్యాయవాదుల నిరసన నేపథ్యంలో కేసు విచారణ వాయిదా పడింది. 2018 ఆగస్ట్​ 4న పార్లమెంట్​ లో కేంద్రమంత్రిపై అనుచిత వ్యాఖ్యలపై కోత్వాలీ దేహత్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హనుమాన్‌గంజ్ నివాసి, మాజీ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్, బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం ఫిర్యాదు చేశారు.