ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న బీసీసీఐ
పాక్ విజయమంటూ సిగ్గులేని పోస్టు
దుబాయ్: ఆసియా కప్ –2025 విజయం అనంతరం పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీతో భారత్ క్రీడాకారులు కప్ తీసుకునేందుకు నిరాకరించారు. మరేవరితోనైనా అందించాలన్నారు. ఈ నేపథ్యంలో నఖ్వీ ఆసియాకప్ ను తన అనుచరులతో పంపించి, తాను వెనుదిరిగి చూడకుండా వెళ్లారు. సిగ్గులేకుండా పాక్ ఆసియాకప్ లో విజయం సాధించిందని పోస్ట్ చేశారు. కాగా ఈ పరిణామంపై ఐసీసీలో పీసీబీపై ఫిర్యాదు చేయనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
కాగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరికి భారత్ గెలుపొందడంతో పాక్ కు చుక్కలు కనిపించాయి. అనంతరం భారత క్రీడాకారులు కరచాలనం చేయకపోవడం, ఆసియా కప్ ను పీసీబీ చీఫ్ తో తీసుకోకపోవడం, మరెవరి ద్వారానైనా తీసుకుంటామని తెగేసి చెప్పడంతో పాక్ కు ఈ పరిణామాలు శరాఘాతంగా మారాయనే చెప్పాలి.
కాగా మ్యాచ్ గెలిచిన అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమం 1.5 గంటలు ఆలస్యమైంది. పాక్ క్రీడాకారులు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆలస్యమైంది. తటస్థ కార్యనిర్వాహకుడు ఇతర ట్రోఫీలను భారత జట్టుకు అందించారు. అంతకు ముందే నఖ్వీ గబగబా మైదానం నుంచి పారిపోయాడు.