మోదీ–ట్రంప్ బంధం బలోపేతం
అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి
వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీల మధ్య స్నేహబంధం బలంగా ఉందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోదీకి ఆహ్వానం అందించారా? అనే విషయం తనకు తెలియదన్నారు. అయితే తొలిసమావేశం ట్రంప్–మోదీల మధ్యే జరగాలని తాను భావిస్తున్నట్లు ఎరిక్ ఆకాంక్షించారు. భారత్–యూఎస్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పని అన్నారు. ఇరుదేశాల మధ్య అనేక ఒప్పందాలు భాగస్వామ్యం మరింత పటిష్టం అవుతుందన్నారు. వచ్చే వారం బెంగళూరులో నూతన కాన్సులేట్ ను ప్రారంభిస్తామన్నారు. భారత్ ఆశావాదం, పురోగతి తనకు సంతోషాన్ని కలిగిస్తుందని ఎరిక్ గార్సెట్టి అన్నారు.