నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అధికారం పూర్తి చేసుకొని 74 నుంచి 75వ పడిలోకి అడుగిడబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ అనేక అవార్డులు, రివార్డులే గాక ‘డైమండ్ జూబ్లీ’ని జరుపుకోనున్నారు. సాధారణ టీ అమ్మే వ్యక్తి నేడు ప్రపంచానికి దశ, దిశ, నిర్దేశం చూపించే వ్యక్తిగా ఎదిగారు. ఆయన ప్రయాణమంతా ఓ సాధాసీదా వ్యక్తిలానే జరిగినట్లు కనిపించినా అనేక అవరోధాలు, అవాంతరాలు, ముళ్లకంచెలు, బాటలను అధిరోహించారు. ఇక ప్రధానమంత్రిగా ఎన్నికైన 11 ఏళ్ల కాలంలోనైతే సాక్షాత్తూ పలు ప్రపంచదేశాలతోపాటు, శత్రుదేశాలు, దేశంలో ఉన్న దేశవిచ్ఛిన్నకర పందికొక్కులు అనేక అవంతరాలను సృష్టించారు. అయినా ఏ మాత్రం మొక్కవోని ధైర్యంగా నేడు భారత్ ను ప్రపంచదేశాల్లో అగ్రగామిగా నిలపాలన్న ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహానుభావుడు నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన అరుదైన చిత్రాలు.. 1970న గుజరాత్ లోని వాద్ నగర్ లో దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ, తల్లి హీరాబెన్ దంపతులకు జన్మించారు.
1992 ఏక్తా యాత్ర సందర్భంగా నుదుటిపై తిలకం దిద్దుతున్న తల్లి హీరాబెన్
ఎన్ సీసీ క్యాడెట్ గా యవ్వనంలో..
సంఘర్ష్ మా గుజరాత్ పుస్తకం విడుదల సందర్భంగా మోదీ ప్రసంగం
2002లో రాజ్ కోట్ నుంచి గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికకు మోదీ నామినేషన్
నరేంద్ర మోదీ వెనుక అమిత్ షా, సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ (కూర్చొని)
వివేకానంద ప్రేరణలతో ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీ